ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
ఇండ్లు కూలిన వారికి పరామర్శ
డబుల్ బెడ్రూములు ఇప్పిస్తానని హామీ
రఘునాథపల్లి, జూలై 12 : భారీ వర్షాలతో ఇండ్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని స్టేషన్ఘన్ఫూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య భరోసా ఇచ్చారు. మండలంలోని మల్లం పల్లిలో సోమవారం రెండు ఇండ్లు కూలిపో యాయి. అధికారులతో కలిసి మంగళవారం బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండ్లు కోల్పోయిన వారికి గ్రామానికి 40 డబుల్ బెడ్రూం పథకం ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. నియోజక వర్గానికి మూడు వేల డబుల్ బెడ్రూంలు ఇస్తామని సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. మండలంలోని బాధితులు కోమాళ్లలో బంద సుధాకర్, నిడిగొండ గ్రామస్తుడు శ్రీహరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తక్షణ సహాయంగా టార్పాలిన్ కవర్లను అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ రాంరెడ్డి, తహసీల్దార్ ఆన్వర్, ఎంపీడీఓ ఆసీం, సర్పంచ్ గంపల శేఖర్, కంచనపల్లి ఎంపీటీసీ కెమిడి రమ్య-రాజు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ముసిపట్ల విజయ్, మండల సమన్వయకర్త మడ్లపల్లి సునీత-రాజు, సర్పంచ్ శివరాత్రి కొంరయ్య, నాయకులు ఇంగ్లే నర్సింహా, తాళ్లపల్లి దావీదు, తాళ్లప ల్లి ప్రవీణ్, తాళ్లపల్లి బాలు, తాళ్లపల్లి వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.
శిథిలావస్థలోని ఇండ్లలో ఉండొద్దు : ఎంపీడీఓ రఘురామకృష్ణ
బచ్చన్నపేట : వర్షాలు కురుస్తున్నం దున ప్రజలు ఎవ్వరూ శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని ఎంపీడీఓ రఘురామకృష్ణ సూచించారు. మం డల కేంద్రంలోని స్థానిక బస్టాండ్తో పాటు ఆయా గ్రామాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ శిథిలా వస్థకు చేరిందని ప్రయాణికులు బస్టాండ్లోకి పోరాదని సూచించారు. వాగులు, చెరువు వద్దకు ఎవ్వరూ వెళ్లరా దని దీనిపై ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జ్యోస్త్న, ప్రయాణికులు తదితరులు ఉన్నారు.