ఇబ్రహీంపట్నం రూరల్, సెప్టెంబర్ 13: చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే సూక్ష్మజీవులు (పరాన్నజీవులు) నులి పురుగులు. ఇవి పిల్లలు తీసుకున్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించి వారిని శక్తి హీనులుగా మారుస్తాయి. దీంతో పోషకాహార లో పం, ఆకలి మందగించడం, కడుపునొప్పి, శక్తిహీనత వంటి సమస్యలు వస్తాయి. రంగారె డ్డి జిల్లాలో 1-19 ఏండ్ల లోపు 9,90,563 మం ది విద్యార్థులున్నట్లు ఇప్పటికే వైద్యారోగ్యశాఖ గుర్తించింది. గురువారం నుంచి వారందరికీ అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల లు, కళాశాలల్లో పంపిణీకి ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు రంగారెడ్డిజిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి తెలిపారు. చిన్న వయసులోనే పిల్లల్లో నులి పురుగులను నివారిస్తే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో జాతీయ ఆరోగ్య సంస్థ చిన్నారుల్లో ఆరోగ్యకరమైన లక్షణాలను పెంపొందించేందుకు నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రల పం పిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఈ నెల 15 నుంచి 18 వరకు మూడు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
నులి పురుగులు వ్యాప్తి చెందే విధానం..
పిల్లల్లో నులి పురుగులు వివిధ రకాలుగా వ్యాప్తి చెందుతాయి. ఆరుబయట చెప్పులు లేకుండా ఆడుకోవడం, గాలి, దుమ్ము ప్రదేశాల్లో మూతికి చేతి రుమాలు లేకుండా వెళ్లడం, చేతులను శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తీసుకోవ డం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, శుభ్రంగా ఆహార పాత్రలు లేకపోవడం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వంటి అజాగ్రత్తలతో నులి పురుగులు వ్యాప్తి చెందుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్యశాఖాధికారులు సూచిస్తున్నారు.
పిల్లల్లో వాటి ప్రభావం..
చిన్నారుల్లో నులిపురుగులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. నులి పురుగుల వ్యాప్తితో పోషకాహార లోపం, ఆకలి మందగించడం, కడుపునొప్పి, శక్తిహీనత వంటి సమస్యలు వస్తాయి. కడుపులో వికారం, తీవ్ర కడుపునొప్పి, విరేచనాలతో చిన్నారులు ఇబ్బందులకు గురవుతారు. పిల్లల ఎదుగుదల కూడా తగ్గిపోతుంది. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది.
పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి
నులి పురుగులను పూర్తిస్థాయిలో నిర్మూలిస్తేనే పిల్లల ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లలు ప్రతిరోజూ స్నానం చేయాలి. ఆహారం తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మలవిసర్జనకు మరుగుదొడ్డిని మాత్రమే ఉపయోగించాలి. పరిశుభ్రమైన ఆహారాన్ని, స్వచ్ఛమైన నీటిని మాత్రమే తీసుకోవాలి. వంటలో తాజా కూరగాయలను మాత్రమే వాడాలి. చేతిగోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
మాత్రల పంపిణీ ఇలా..
నులి పురుగుల నివారణ మాత్రలను పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద పిల్లలకు పంపిణీ చేస్తారు. ఐదేండ్లలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో, 6-19 ఏండ్లలోపు వారికి పాఠశాలలు, కళాశాలల్లో అందజేస్తారు. రెండేండ్ల లోపు చిన్నారులకు సగం మాత్రను (200 ఎంజీ) నీటిలో కలిపి తాగించాలి. 2 నుంచి 19 ఏండ్ల లోపు పిల్లలకు ఒక మాత్రను (400 ఎంజీ) వేయించాలి. ఏడాది లోపు పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ మాత్రలు వేసుకోవద్దు.
1-19 ఏండ్ల లోపు పిల్లలకు పంపిణీ
జిల్లాలో అల్బెండజోల్ మాత్రల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 1-19 ఏండ్ల లోపు చిన్నారులు 9,90,563 మంది ఉన్నారు. వీరందరికీ ఈనెల 15 నుంచి మూడు రోజులపాటు మాత్రలను వైద్యాధికారులు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీల్లో పంపిణీ చేయనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగ్గా ఈ మాత్రలను తీసుకుని ఆరోగ్యంగా ఉండాలి. భోజనం తర్వాతే వీటిని వేసుకోవాలి. మాత్రలు వేసుకున్నవారికి ఏదైనా సమస్య వస్తే వెంటనే ప్రభుత్వ దవాఖానలోని వైద్యులను సంప్రదించాలి. – స్వరాజ్యలక్ష్మి, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి