వరంగల్ రూరల్ : ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలోని మానుబోతులగడ్డ గ్రామ శివారులో చోటుచేసుకుంది. అన్వర్ పాషా(50) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధించడానికి వెళ్లి తిరిగి బైక్పై వస్తున్న క్రమంలో రోడ్డు ప్రక్కనే ఉన్న వ్యవసాయబావిలో ప్రమాదవాశాత్తు పడి మరణించాడు.