సిద్దిపేట, జూలై 8 : పట్టణ పరిధిలోని 15వార్డు గాడిచర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నపూర్ణ ట్రస్టు అందించే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ఎం ఈవో యాదవరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పిల్లలకు ఉదయం పూట టిఫిన్ను అందజేశారు. పిల్లలకు మూడు రకాలైన టిఫిన్ ఉచితంగా అందజేయడంపై నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉదయశ్రీ, ఉపాధ్యాయుడు రాములు పాల్గొన్నారు.