దరఖాస్తు చేసిన 39 కాలేజీలు
హైదరాబాద్, మార్చి 13 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల తరహాలో తాము బోధిస్తున్న కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు కోసం 39 కాలేజీలు దరఖాస్తుచేశాయి. రాష్ట్రంలో 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా, రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కాలేజీ (మైనారిటీ)కి మాత్రమే ఎన్బీఏ గుర్తింపు ఉన్నది. గతంలో గార్మెంట్ టెక్నాలజీ, కమర్షియల్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు లభించగా, వాటిని రద్దుచేసి, ప్రస్తుతానికి ఎలక్ట్రికల్, కంప్యూటర్సైన్స్ కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు పొందారు.
ఎన్బీఏ గుర్తింపుతో ఉపయోగాలు
1 – ఎన్బీఏ గుర్తింపు పొందిన ప్రభుత్వ పాలిటెక్నిక్లు
39 – ఎన్బీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసిన కాలేజీలు