మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని రహదారులకు మహర్దశ
జిల్లా కేంద్రంలో బస్తీ దవాఖానకు రూ. కోటి మంజూరు
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 24: జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలోని రోడ్ల మరమ్మతులకు రూ. 35 కోట్లు నిధులు మంజూరయ్యాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆమె ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నారాయణ్ఖేడ్లో నీటిపారుదల ప్రాజెక్ట్ శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ విచ్చేసిన సందర్భంలో ఉమ్మడి జిల్లాకు రోడ్ల మరమ్మతులకు నిధులు కావాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందులో భాగంగా సీఎం ప్రత్యేక నిధి నుంచి మెదక్ జిల్లాలోని మెదక్తో పాటు నర్సాపూర్ నియోజక వర్గంలోని 29 రోడ్ల మరమ్మతులకు రూ. 25 కోట్లు మంజూరయ్యాయన్నారు. పీఆర్ నుండి మరో రూ. 10 కోట్లు అదనంగా మంజూరైనట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నిధులతో ఏడేండ్ల క్రితం వేసిన రోడ్ల మరమ్మతులు చేపడుతామన్నారు.
త్వరలోనే టెండర్లు నిర్వహిస్తామని, టెండర్ ప్రక్రియ ప్యాకేజీ లాగా చేపట్టాలని మంత్రి హరీశ్రావును కోరామని తెలిపారు. త్వరలోనే మిగిలిపోయిన రోడ్లకు నిధులు కావాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నిధులు మంజూరుకు కృషి చేసిన మంత్రికి, మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా మెదక్ మున్సిపాలిటీకి రూ.20 కోట్లు, రామాయంపేట మున్సిపాలిటీకి రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపామని, అవి మంజూరు దశలో ఉన్నాయని, మంజూరు కాగానే అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. జిల్లా కేంద్రంలోని చౌరస్తాను తీర్చిదిద్దుతామన్నారు. జిల్లా కేంద్రంలో బస్తీ దవాఖానకు రూ. కోటి మంజూరైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. త్వరలోనే బస్తీ దవాఖానను ప్రారంభిస్తామన్నారు.
మెదక్లో సివిల్ సైప్లె రేక్ పాయింట్..
గజ్వేల్తో పాటు మెదక్ రైల్వే స్టేషన్లో త్వరలోనే ఫర్టిలైజర్ రేక్ పాయింట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని, అంతేగాకుండా సివిల్ సైప్లె రేక్ పాయింట్ సైతం మెదక్కు మంజూరైనట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. రైల్వే శాఖ కొత్త రేక్ పాయింట్ రాకతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. జిల్లాలో రైతులు పండించిన ఉత్పత్తులను ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి, దిగుమతి సులభతరం కానుందన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్, రామగిరి శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, ఎంఎంసీ డైరెక్టర్ సాప సాయిలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, హవేళి ఘనఫూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, కిష్టయ్య పాల్గొన్నారు.