అమరావతి : కర్ణాటక గవర్నర్ తవర్ చాంద్ గెహ్లట్ ఈరోజు తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు గవర్నర్కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ డిప్యూటీ ఈవోలు రమేశ్, లోకానందం గవర్నర్కు శ్రీవారి ప్రసాదాన్ని, టీటీడీ క్యాలెండర్ను అందజేశారు.