యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామి వారి వైకుంఠ ద్వారం నుంచి పాత గుట్ట సర్కిల్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ఆదివారం పరిశీలించారు. ప్రధాన రోడ్డులో బ్రిడ్జీ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో పెంచిన రోడ్డు ఎత్తును తగ్గించాలని స్థానికుల కోరిక మేరకు ప్రభుత్వ విప్ ఈఎన్సీ రవీందర్రావుతో మాట్లాడి కేవలం పాతగుట్ట చౌరస్తా వరకే రోడ్డు నిర్మించి ఎత్తును తగ్గించాలని కోరారు.
దీంతో స్పందించిన ఈఎన్సీ వెంటనే తగు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణాలను పరిశీ లించి స్థానికుల అభిప్రాయం తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాగౌడ్, వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి నాగరాజు, యువజన విభాగం పట్టణాధ్యక్షుడు ముఖ్యర్ల సతీశ్యాదవ్, నాయకులు మధుసాయి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.