అమరావతి : ఏపీలో న్యాయమైన పీఆర్సీ సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పీఆర్సీ సాధన సమితి నాయకుడు బొప్పరాజు వేంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం శ్రీకాకుళంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఎన్జీవో హోమ్ వద్ద చేపట్టిన నిరాహా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నాలుగు జేఏసీలు ఉమ్మడిగా న్యాయమైన ధర్మ పోరాటం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని, డిమాండ్ చేశారు.
గుంటూరు కలెక్టరేట్ ఎదుట నాలుగో రోజు ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఆర్సీని వ్యతిరేకిస్తూ వెనక్కి నడిచి నిరసన తెలిపారు. కర్నూలులో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలకు ఉద్యోగులు , టీచర్లు భారీగా తరలివచ్చారు. కడప జిల్లా రైల్వేకోడూరులో గాంధీ విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలను కొనసాగించారు.