హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంతో సర్కారు బడులు సరికొత్త కళను సంతరించుకొంటున్నాయి. రోజురోజుకు విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. అతి తక్కువకాలంలోనే అడ్మిషన్లు లక్షకు సమీపించాయి.
ఈ నెల 3 నుంచి బుధవారం వరకు 99,826 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరినట్టుగా అధికారులు వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే 9,970 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో అడ్మిషన్లు పొందారు. 30 వరకు బడిబాట కొనసాగనున్నది.