నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతన పట్టణ కమిటీ పని చేయాలని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడే వారిని సమన్వయపర్చుకుని ఐక్యంగా ముందుకుసాగాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధికి కృషి చేయలేదని, తెలంగాణ ఏర్పడి తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పట్టణ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు గడపగడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మూడ రామచందర్, మాజీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పరశురామ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, 15 వార్డుల కమిటీ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఖేడ్ పట్టణ అధ్యక్షుడిగా నగేశ్
అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నారాయణఖేడ్ పట్టణ అధ్యక్షుడిగా బాదల్గామ నగేశ్ను నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రకటించారు. కాగా ఉపాధ్యక్షులుగా దుర్గయ్య, సయ్యద్ హాశంఅలీ, నర్వ మాణిక్యం, కార్యదర్శిగా పత్రి విఠల్, సంయుక్త కార్యదర్శిగా కే.రవి, కోశాధికారిగా యశ్వంత్నాయక్, కార్యవర్గ సభ్యులుగా ఎం.ఎస్.ప్రసాద్, రాజు, పండరి, సయ్యద్ హమీద్, ఎం.ఏ.ఖయ్యూమ్, నర్సింలు, రామప్పలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్టణ అధ్యక్షుడు బాదల్గామ నగేశ్ సహా 15 వార్డుల కమిటీ అధ్యక్షులను శాలువా, పూలమాలలతో సన్మానించి అభినందించారు.