ఢిల్లీ ,జూన్ 4: కోవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితుల ఫలితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ధరల అస్థిరతను దృష్టిలో పెట్టుకుని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ధరలను క్రమబద్ధీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం డిస్ట్రిబ్యూటర్స్ లెవల్ లో మార్జిన్ 198శాతం ఉంది.
ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని డిపిసిఒ, 2013లోని పారా 19 కింద అసాధారణ అధికారాలను ఉపయోగిస్తూ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై పంపిణీదారు స్థాయిలో ధర(పిటిడి) పై వాణిజ్య మార్జిన్ను 70శాతంగా ఎన్పిపిఎ నియంత్రించింది. ఇంతకుముందు, ఎన్పిపిఎ యాంటీ-కాన్సర్ మందులపై వాణిజ్య మార్జిన్ను ఫిబ్రవరి 2019లో విజయవంతంగా నియంత్రించింది. నోటిఫై చేసిన వాణిజ్య మార్జిన్ ఆధారంగా సవరించిన ఎంఆర్పిని మూడు రోజుల లోపల నివేదించవలసిందిగా ఎన్పిపిఎ ఉత్పత్తిదారులను, దిగుమతిదారులను ఆదేశించింది. సవరించిన ఎంఆర్పి ధరలను ఎన్పిపిఎ వారం రోజులలో వెల్లడించనుంది.