హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. రాష్ట్రంలో మెరుగైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. రెండు భాషల్లో పాఠ్య పుస్తకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని.. టీచర్లను తొలగించే ప్రసక్తే లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. ఏ తరగతికైనా తెలుగు తప్పనిసరిగా వుంటుందన్నారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
నూతన విద్యా విధానంలో సూళ్లను 6 రకాలుగా ఖరారు చేస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వీటిలో శాటిలైట్ సూల్స్ (పీపీ-1, పీపీ-2), ఫౌండేషన్ సూల్స్ (పీపీ-1, పీపీ 2, 1, 2), ఫౌండేషన్ ప్లస్ సూల్స్ (పీపీ 1 నుంచి 5వ తరగతి వరకు), ప్రీ సూల్స్ (3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు), హైసూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకు), హైసూల్ ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) ఉంటుంది.
ప్రతి సబ్జెక్ట్ ఒక టీచర్, ప్రతి తరగతికి ఒక తరగతి గది ఉండాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా 4,800 తరగతి గదుల నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈ నెల 16న విద్యా కానుక అందజేయాలని నిర్ణయించింది. ఆగస్టు 10న మూడో విడత నేతన్న నేస్తం చెల్లించాలని.. ఈ పథకానికి రూ.200 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికే రూ.238 కోట్లు చెల్లింపు జరిగాయని..రూ.20 వేల లోపు డిపాజిట్ దారులకు ఈ నెల 24న చెల్లింపుచేయాలని నిర్ణయించింది.
కాకినాడ అర్బన్ డెవలప్ అథారిటీగా గోదావరి అర్బన్ డెవలప్ అథారిటీ ,రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ అథారిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్