బెంగళూరు, జూలై : ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇటీవల మ్యూజిక్ సేవలను నిలివేసిన గూగుల్….తాజాగా మరో కొత్త నిర్ణయం తీసుకుంది.సెర్చింజన్ లో బుక్ మార్క్స్ ఆప్షన్ ఎత్తివేయనున్నది. సెప్టెంబర్ 30 నుంచి ఆప్షన్ ను నిలిపివేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది. క్లౌడ్ అధారంగా ఈ సేవలు ఇప్పటి వరకు గూగుల్ యూజర్లకు అందుబాటులో ఉంచింది.
వెబ్ పేజీలను, ఆడ్ లెబిల్స్ ను ముఖ్యమైన నోట్స్ ను బుక్ మార్క్ చేసుకునే అవకాశం ఈ ఆప్షన్ ద్వారా లభించింది. అయితే ఈబుక్ మార్క్ సేవలకు యూజర్ల నుంచి పెద్దగా ఆదరణ లేకపోవటంతో దానిని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. 2005 నుంచి గూగుల్ ఈ సేవలను యూజర్లకు అందుబాటులో ఉంచింది.