JNTU new policy | విద్యార్థి ఫ్రెండ్లీ విధానాలు తీసుకొనే జేఎన్టీయూ ( JNTU ) .. మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిపాటు చదువును మధ్యలో ఆపి మళ్లీ కొనసాగించే బ్రేక్ స్టడీ ( Break study ) విధానాన్ని తీసుకొచ్చింది. స్టార్టప్స్లో రాణించే విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారికి ఈ అవకాశం కల్పించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్టు జేఎన్టీయూ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. ఇది వరకు బీటెక్ ( BTech )లో చేరితే నాలుగేండ్లపాటు వరుసగా చదువాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒక విద్యార్థి గరిష్ఠంగా రెండు సెమిస్టర్లపాటు తాత్కాలిక విరామం తీసుకోవచ్చు. బీటెక్ విద్యార్థులు కొందరు ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు స్టార్టప్స్లో రాణిస్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఈ దశలో అటు చదువా.. ఇటు స్టార్ట ప్పా.. అన్నది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మధ్యలో చదువులు ఆపేస్తే పట్టా చేతికి అందదని.. చదువులకు ప్రాధాన్యమిస్తే మొగ్గదశలోనే నవ ఆలోచనలను తుంచేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన జేఎన్టీయూ బ్రేక్ స్టడీ విధానాన్ని తీసుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జేఎన్టీయూలో కొత్త కోర్సులు.. 30న గోల్డెన్ జూబ్లీ వేడుకలు ప్రారంభం
JNTU : కొలువులిచ్చే కొత్త కోర్సులు.. ఈ ఏడాది కొత్తగా 6 కోర్సులు ప్రారంభం
బీటెక్ విద్యార్థులకు రాజ్యాంగ బోధన..!