హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి: ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ)కు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ పీకాక్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. మానవ వనరుల విభాగం నిర్వహణలో ఉత్తమ విధానాలను పాటించిన ఈఎస్సీఐకి 2021 ఏడాదికి గాను ఈ అవార్డును ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అందజేసింది.
న్యూఢిల్లీలో 3న నిర్వహించిన కార్యక్రమంలో ఈఎస్సీఐ డైరెక్టర్ డాక్టర్ జీ రామేశ్వర్రావుకు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అవార్డును అందజేశారు. ఈఎస్సీఐ ఇప్పటివరకు 7 గోల్డెన్ పీకాక్ అవార్డులను గెలుచుకొన్నదని రామేశ్వర్రావు తెలిపారు.