చెన్నై : పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానావ్రయంలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా గల్ఫ్కు వెళ్లే, గల్ఫ్ నుండి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేయగా 5.55 కేజీల బంగారం, రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 2.53 కోట్లుగా సమాచారం. విగ్స్, సాక్సులు, ఇన్నర్వేర్, పేస్టు రూపంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.