న్యూఢిల్లీ: క్రితం ట్రేడింగ్తో పోల్చితే దేశంలో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ్టి ట్రేడింగ్లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.35 పెరిగి రూ.43,996కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల బంగారం ధర 43,961 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు పెరిగినా దేశీయంగా బంగారం ధరలపై ఆ ప్రభావం పెద్దగా పడలేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇదిలావుంటే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో ఇవాళ కిలో వెండి ధర రూ.553 పెరిగి రూ.65,621కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.65,068 వద్ద ముగిసింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,696 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.50 అమెరికన్ డాలర్లు పలికింది.