న్యూఢిల్లీ: దేశంలో గత రెండు రోజులు ఎగిసిన బంగారం, వెండి ధరలు ఇవాళ తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.148 తగ్గి రూ.46,307కు దిగివచ్చింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,455 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధర తగ్గడం, అమెరికన్ డాలర్తో పోల్చితే రూపాయి కాస్త బలపడటం ఇవాళ దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధరలు కూడా బుధవారం దిగివచ్చాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.886 తగ్గి రూ.68,676కు దిగివచ్చింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.69,562 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,807 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 27.63 అమెరికన్ డాలర్లు పలికింది.