ఊహ, శ్రీమతి కల్యాణం చిత్రాలను తెరకెక్కించిన ప్రభాకర్ శివాల దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ‘గోకులంలో గోవిందుడు’. లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై పీఎన్ రెడ్డి నిర్మించనున్నారు. నవ్యమైన కథ, కథనాలతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ను ఫిబ్రవరి ప్రథమార్థంలో ప్రారంభిస్తామని, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజేష్ కె కతూరి.