జమ్మికుంట : వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదివారం 13,14వ వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరిగారు. ఓటర్లను కలిశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని ఓటును అభ్యర్థించారు. వృద్ధుల కు నమూనా ఈవీఎంను చూపించారు. కారు గుర్తును చూపించారు. ఓటెలా వేయాలో చూపించారు. ఓటుపై అవగాహన కల్పించారు. తర్వాత ఆయన 14వ వార్డులోని ప్రజలతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
ఐదేండ్లు ఎమ్మెల్యేగా ఉండి సమస్యలన్నీ పరిష్కరించమని ఓటేసి గెలిపించిన ఈటల రాజీనామా చేశాడని, ప్రజల వ్యతిరేక పార్టీ బీజేపీలో చేరాడని ఆరోపించారు. మంత్రిగా అభివృద్ధి చేయలేని ఈటల, ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడని ప్రశ్నించారు. బీజేపీకి ఇక్కడ స్థానం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిష్కరిస్తూ.. అన్ని వర్గాలకు అండగా ఉంటు న్న టీఆర్ఎస్ నే గెలిపించాలని కోరారు. ఆయన వెంట కౌన్సిలర్లు శ్రీనివాస్, రమేశ్, స్థానిక నాయకులున్నారు.