కరీంనగర్ రూరల్, అక్టోబర్ 6: మండలంలో దుర్గాదేవి నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దుర్శేడ్లోని వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గా దేవి మండపంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాదేవి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పెట్టి శోభాయాత్ర నిర్వహించగా, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అలాగే, శక్తి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహాలను గోపాల్పూర్ చెరువులో నిమజ్జనం చేశారు. వేడుకల్లో ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు, వేముల రాంచందర్, గాజుల హరికృష్ణ, రాజ్కమల్, కోరుకంటి వేణుమాధవరావు, సంపత్, శ్రీనివాస్, వేముల అశోక్, ప్రసాద్, తోట వినయ్, సంపత్, రాజు, శ్రీనివాస్, మహేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చెర్లభూత్కూర్లోని చెన్నకేశవాలయంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శోభాయాత్ర నిర్వహించగా, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మహిళల కోలాట ప్రదర్శన, దాండియా ఆకట్టుకుంది. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేశారు. గోపాల్పూర్లో లక్ష్మీనృసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు దాడి రాము, సంపత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తులు భజన చేస్తూ, పాటలు పాడుతూ ఊరెగింపు నిర్వహించారు. వేడుకల్లో దాడి తిరుపతి, దాడి రాజు, రాజు, శ్రీనివాస్, సంపత్, మధు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నగునూర్లో దుర్గాదేవి శోభాయాత్రలో దీక్షాపరుల భజన పాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు.
కమాన్చౌరస్తా, అక్టోబర్ 6: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మండపాల్లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనం గురువారం నేత్రపర్వంగా కొనసాగింది. మండపాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో దుర్గాదేవి విగ్రహాలను ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో టవర్ సరిల్ వద్ద వేడుకలు మిన్నంటాయి. వాహనాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. యువత కాషాయ ధ్వజాలతో కేరింతలు కొడతూ, నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. భక్తులు ఉత్సాహంతో శోభాయాత్రలో పాల్గొనగా, మహిళలు మంగళహారతులు, పాటలు, నృత్యాలతో అమ్మవారికి వీడోలు పలికారు. దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
ముకరంపుర, అక్టోబర్ 6: కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ సెక్షన్ విద్యుత్ కార్యాలయంలో సిబ్బంది దుర్గాదేవి పూజ వైభవంగా నిర్వహించారు. పూజల్లో ఏఈ తిరుపతి, ఎస్ఎల్ఐ రఘుపతి, ఎల్ఐ కొండగట్టు, లైన్మెన్లు ప్రకాశ్, ఫారూఖ్, మారుతి, జేఎల్ఎంలు చంద్రశేఖర్, శ్రీకాంత్, రాకేశ్, రఘు, అమర్, అన్మ్యాన్డ్, ఆర్టిజన్ కార్మికులు శ్రీనివాస్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.