రామగిరి, అక్టోబర్ 6 : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవిని భక్తులు గురువారం సంప్రదాయంగా గంగా ఒడికి సాగనంపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన శోభయాత్రలో ప్రత్యేక డీజే పాటలు, యువతీ యువకులు ఆటపాటలు, కోలాటాలు, చెక్క భజన ఆకట్టుకున్నాయి. అంతకు ముందు అమ్మవారి చీరెలు, లడ్డు, ఇతర సామగ్రిని వేలం వేయగా భక్తులు పోటీ పడ్డారు.
జిల్లా కేంద్రంలో ..
పట్టణంలోని పాతబస్తీ, మాన్యంచెల్క, సావర్కర్నగర్, శ్రీరాంనగర్ కాలనీ, వీటీ కాలనీ, బోయవాడలోని విద్యానగర్, పద్మావతీనగర్ కాలనీ, శ్రీరాంనగర్కాలనీ, అలకాపురి కాలనీ, అలివేలు మంగాపురం కాలనీ, దేవరకొండ రోడ్డు, రాంనగర్, బొట్టుగూడ, వివేకానంద నగర్ కాలనీ, క్రాంతి నగర్, హైదరాబాద్రోడ్డులోని వినాయకనగర్తో పాటు పలు ప్రాంతాల్లో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం నిమజ్జనానికి వల్లభరావు చెరువుతోపాటు పలు ప్రాంతాలకు తరలించారు.
సరస్వతి దేవి అమ్మవారు ఊరేగింపు
దేవరకొండ, అక్టోబర్ 6 : స్థానిక కన్యకాపరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. గురువారం అమ్మవారిని పట్టణంలో ఊరేగించారు. నాగపూర్ బ్యాండ్లు, పొద్దుటూర్ చెక్కభజనలు, మహిళల కోలటాలతో ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు మూరెల్ల పవన్, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, రవి, నవీన్, వాసా వెంకటేశ్వర్లు, గుద్దేటి జంగయ్య, కొత్త సుబ్బారావు, పానుగంటి మల్లయ్య, సంజీవ్, దొడ్డి సుధాకర్, వెంకటేశ్వర్లు, సోమ నరేందర్ పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం అమ్మవారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు ఊరే జనార్దన్, గొరు వెంకటేశ్వర్లు, చంద ధనుంజయ్ పాల్గొన్నారు.
హనుమాన్పేటలో అన్నదానం
మిర్యాలగూడటౌన్ : పట్టణంలోని హనుమాన్పేటలో హనుమాన్పేట ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర చేపట్టారు.
హాలియాలో శోభాయాత్ర
హాలియా : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత గురువారం గంగ ఒడికి చేరింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి మేళ తాళాలు, బాజా భజయంత్రీల మధ్య ఊరేగింపు నిర్వహించారు. సాయిప్రతాప్నగర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయం, షిర్డిసాయి మందిరం, కోదండ రామాలయం, జడల రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు జిల్లబోయిన విజయ్, చందు, నర్సింహ, పిల్లి వెంకట్, హరి, సందీప్, చరణ్, సాయి, జయంత్, మహేశ్ పాల్గొన్నారు.
కట్టంగూర్ : కట్టంగూర్, ఈదులూరు, పరడ, ముత్యాలమ్మగూడెం, అయిటిపాముల గ్రామాల్లో దుర్గాదేవి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్నగర్లో జడ్పీటీసీ తరాల బలరాములు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కోమటి భాస్కర్, రెడ్డిపల్లి మనోహర్, కాపుగంటి గోపి, ముడుసు భిక్షపతి, ముడుసు గోవర్దన్, రవి, సంతోష్రెడ్డి, శంకర్, శ్రీశైలం, ఉత్తరయ్య, రాహుల్, కృష్ణంరాజు, యాదగిరి, నరేశ్ పాల్గొన్నారు.
అమ్మవారి వస్తువుల వేలం
కనగల్ : మండలంలోని ఎం. గౌరారం గ్రామంలో దుర్గామాత శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించారు. అంతకు ముందు నిర్వహించిన అమ్మవారి వస్తువుల వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామానికి చెందిన నాగులవంచ వసంతరావు దంపతులు రూ.50వేలకు మణిపాలను దక్కించుకోగా చీరెలు, ఆభరణాలు, కలశం, ఆయుధాల వేలం ద్వారా రూ.1.50 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ చైర్మన్ గోన రవీందర్రావు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఆలయ గౌరావాధ్యక్షుడు నాగులవంచ సులక్షణశేఖర్రావు, భక్తులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్
నీలగిరి : దుర్గామాత నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ డా.కేవీ.రమణాచారి తెలిపారు. గురువారం ఉదయం దండెంపల్లి ఎస్ఎల్బీసీ కాల్వ వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తులు ప్రశాంతంగా నిమజ్జనం చేయాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు ఆశోక్, దిలీప్భార్గవ్, గులాం ముర్తుజావలీ, సీసీ మహ్మద్ రఫీ ఉన్నారు.