దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నగర వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలు, మండపాల్లో కొలువుదీరిన అమ్మవార్లు తీరొక్క రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.పలు మండపాల వద్ద మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి శ్రీ అన్నపూర్ణాదేవిగా, బల్కంపేట ఎల్లమ్మను గాయత్రీదేవిగా, సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
బంజారాహిల్స్: దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి బుధవారం
శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
మన్సూరాబాద్: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన్సూరాబాద్ డివిజన్ పరిధి సీఆర్ ఎన్క్లేవ్లోని స్వయంభూ శ్రీ పోచమ్మ ఆలయంలో అమ్మవారిని శ్రీగాయత్రి దేవి రూపంలో అలంకరించి పూజలు చేశారు.
అమీర్పేట్: బల్కంపేట ఎల్లమ్మ, అమీర్పేట్ కనకదుర్గమ్మ అమ్మవార్లు బుధవారం శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వెంగళరావునగర్ కాలనీ శ్రీ రామంజనేయస్వామి ఆలయంలో అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
చాంద్రాయణగుట్ట: దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లాల్దర్వాజ సింహ వాహిని
శ్రీ మహంకాళి అమ్మవారు భక్తులకు చంద్రగంటదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని బంగారం, వెండి అభరణాలతో అలంకరించారు.
బేగంపేట్: శరన్నవరాత్రుల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని
రాజరాజేశ్వరిదేవిగా అలంకరించారు.