ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరిగింది. మంగళవారం రాత్రి 51.80 అడుగులుగా ఉన్న నీట్టం నేడు కూడా స్థిరంగా కొనసాగుతున్నది. బుధవారం ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.7 అడుగులగా ఉన్నది. ప్రస్తుతం 13.55 లక్షల క్యూసెక్కల నీరు ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రెండ్ర ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.
కాగా, గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం నుంచి పలు ఊర్లకు రాకపోకలు బందయ్యాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల వెళ్లే రోడ్డుపై వరద ప్రవహిస్తున్నది. అదేవిధంగా తూరుబాక, నెల్లిపాక, బూర్గంపాడు మండలం సారపాక వద్ద రోడ్డుపైకి వరద చేరింది. కూనవరం, వీఆర్ పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.