హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): జీఎంఆర్ ఇన్నోవెక్స్ నూతనంగా బ్లాక్ చెయిన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించింది. శనివారం శంషాబాద్ విమానాశ్రయంలోని ఏరో టవర్స్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ప్రారంభించిన ఈ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ స్టార్టప్లను గుర్తించి, వాటిని ప్రోత్సహిస్తున్నదన్నారు. జీఎమ్మార్ ఎయిర్పోర్టు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, ఈడీ సౌత్ ఎస్జీకు కిశోర్ మాట్లాడుతూ.. వివిధ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ల్యాండ్ స్కేపింగ్ కోసం వివిధ అప్లికేషన్లను రూపొందించేందుకు తమ జీఎమ్మార్ ఇన్నోవెక్స్ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిందన్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి సంబంధించి ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జీఎమ్మార్ ఇన్నోవెక్స్..ఐడియాల్యాబ్స్, పొలిజిన్, కొయినెర్థ్, ఇండియా బ్లాక్చెయిన్ ఫోరంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. మరోవైపు, 2021లో అంతర్జాతీయ బ్లాక్చెయిన్ టెక్నాలజీ మార్కెట్ విలువ 5.92 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నదని, ప్రతియేటా రెండంకెల వృద్ధిని సాధిస్తున్నదన్నారు.