న్యూయార్క్: అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)లో గతంలో చీఫ్ ఎకానమిస్ట్గా పనిచేసిన అమెరికా- భారతీయ సంతతిరాలు గీతా గోపినాథ్ ఇప్పుడు కొత్త బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్లో తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరక్టెర్గా ఆమె ప్రమోషన్ పొందారు. వచ్చే ఏడాది ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ బాధ్యతల నుంచి జెఫ్రీ ఒకమోటో వైదొలగనున్నారు. ఆ స్థానంలో గీతా బాధ్యతలు స్వీకరిస్తారు. మూడేళ్ల పాటు ఐఎంఎఫ్లో ఎకానమిస్ట్గా చేసిన గీతా గోపినాథ్ ఆ జాబ్ను వదిలేసి మళ్లీ హార్వర్డ్ వర్సిటీలో అధ్యాపక వృత్తిని చేపట్టాలనుకున్నారు. కానీ ఐఎంఎఫ్ డైరక్టర్ క్రిస్టలినా జార్జీవా సూచన మేరకు డిప్యూటీ ఎంపీ బాధ్యతల్ని స్వీకరించేందుకు గీతా అంగీకరించారు. గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్కు అద్భుత బాధ్యతల్ని నిర్వర్తించారని, తన నాయకత్వంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఓ రూపాన్ని ఇచ్చారని, ఆర్థిక సంక్షోభం వేళ ఆమె చక్కటి ప్రణాళికలు వేసినట్లు జార్జీవా తెలిపారు. ఐఎంఎఫ్ చరిత్రలో తొలిసారి మహిళా చీఫ్ ఎకానమిస్ట్గా గీతా గోపీనాథ్ బాధ్యతలు నిర్వర్తించారు. గోపీనాథ్ నాయకత్వంలో ఐఎంఎఫ్ రీసర్చ్ శాఖ బలోపేతం అయ్యింది.