ఇంటర్ ఫస్టియర్లో 57% ఉత్తీర్ణత..
బాలురు 41, బాలికలు 70 శాతం
6,274 మందికి 3,626 మంది పాస్
సెకండియర్లో 59% కాగా, బాలురు 44, బాలికలు 72 శాతం
6,227 మందికి 3,732 మంది ఉత్తీర్ణత
ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్లో 49%, ద్వితీయ సంవత్సరంలో 67 శాతం పాస్
గిర్మాజీపేట, జూన్ 28: ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో బాలి కలు పైచేయి సాధించారు. జనరల్ విభాగంలో ఫస్టియర్లో 2,749 మంది బాలురకు 41 శాతం ఉత్తీర్ణతతో 1,142 మంది పాస్ కాగా, 3,525 మంది బా లికలకు 70 శాతంతో 2,484 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 6,274 మందికి 57 శాతంతో 3,626 మంది పాస్ అయ్యారు. సెకండియర్లో 2,738 మంది బాలురకు 44 శాతం ఉత్తీర్ణతతో 1,219 మంది పాస్ కాగా, 3,489 మంది బాలికలు 72 శాతం తో 2,513 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 6,227 మందికి 59 శాతంతో 3,732 మంది పాస్ అయ్యారు. అలా గే ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్లో 352 మంది బాలురకు 29 శాతం ఉత్తీ ర్ణతతో 103 మంది పాస్ కాగా, 598 మంది బాలికలకు 60 శాతంతో 363 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 950 మం దికి 49 శాతంతో 466 మంది పాసయ్యారు. సెకండి యర్లో 314 మంది బాలురకు 49 శాతం ఉత్తీ ర్ణతతో 154 మంది పాస్ కాగా, 515 మంది బాలికలకు 78 శాతంతో 404 మంది ఉత్తీర్ణులయ్యారు.
మొత్తం 829 మందికి 67 శాతంతో 558 మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా ఫస్టియ ర్లో ఎంపీసీ విభాగం నుంచి గీసు గొండ ప్రభుత్వ కళాశాలలో 470 మా ర్కులకు 459 మార్కులతో బత్తుల హా రిక, బైపీసీ విభాగంలో కృష్ణా కళాశాలకి చెందిన దోమల సంకీర్తనకు 440 మా ర్కులకు 432, సీఈసీ విభాగంలో మ మతకుమార్ 500 మార్కులకు 485, హెచ్ఈసీ విభాగంలో బైర తేజస్వి 500 మార్కులకు 445 మార్కులతో ప్రభుత్వ కళాశాలల నుండి జిల్లా టాప ర్గా నిలిచారు. అలాగే సెకండి యర్లో ఎంపీసీ విభాగం నుంచి సంగెం ప్రభు త్వ కళాశాలకు చెందిన ఓదెల నిఖిత 1000 మార్కులకు 977, బైపీసీ విభా గంలో కృష్ణా కళాశాలకి చెందిన సిద్ధం శెట్టి నిఖితకు 1000 మార్కులకు 964, సీఈసీ విభాగంలో దిడ్డి అంజన 1000 మార్కులకు 901, హెచ్ఈసీ వి భాగంలో ఖిలావరంగల్ ప్రభుత్వ కళా శాలకు చెందిన సానియా 1000 మార్కులకు 870 మార్కు లతో ప్రభు త్వ కళాశాలల నుంచి జిల్లా టాపర్గా నిలిచారని డీఐఈవో కాక మాధవరావు తెలిపారు.
కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ చూపారని డీఈవో వాసంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫస్టియర్లో ఎంపీసీ విభాగంలో వర్ధన్నపేట కేజీబీవీ పాఠశా ల నుంచి భార్గవి 459/470, బైపీసీలో ప్రసన్న 427/440, చెన్నారావుపేట కేజీబీవీ నుంచి సీఈసీలో అఖిల 472/500, ఎంపీహెచ్డబ్ల్యూ విభాగంలో నల్లబెల్లి కేజీబీవీ నుంచి రాజే శ్వరి 494/500 మార్కులతో జిల్లాలో టాపర్గా నిలిచార న్నా రు. సెకండియర్ ఎంపీసీలో వర్ధన్నపేట కేజీబీవీ పాఠశా ల నుంచి సోనీ 756/1000, బైపీసీలో కోకిల 869/1000, నల్లబెల్లి కేజీబీవీ నుంచి సీఈసీలో నవత 847/1000, ఎం పీహెచ్డబ్ల్యూలో చెన్నారావుపేట కేజీబీవీ నుంచి వెన్నెల 964/1000 మార్కులతో టాపర్గా నిలిచారని తెలిపారు.