న్యూ ఢిల్లీ: ఒక సామాన్యుడిని సెలబ్రిటీగా మార్చే శక్తి సోషల్ మీడియాకు ఉంది. ఇటీవల పాకిస్తాన్కు చెందిన చాయ్వాలా అర్షద్ఖాన్ అలాగే సోషల్మీడియా స్టార్ అయిపోయాడు. బ్లూకలర్ కుర్తా ధరించిన అర్షద్ కేటిల్లో స్టైల్గా చాయ్పోస్తున్న ఫొటోను ఫొటోగ్రాఫర్ జియా అలీ క్లిక్మనిపించి, సోషల్మీడియాలో పెట్టగా వైరల్ అయ్యింది. ఇదే తరహాలో ఓ రొట్టెలు చేసే అమ్మాయి వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆమె చిరుదరహాసం అందరినీ కట్టిపడేస్తున్నది.
ఈ వీడియోలోని యువతి ఎవరు..? ఎక్కడ చిత్రీకరించారో తెలియదుగానీ.. ఎకియా 5 అనే ఇన్స్టాగ్రాం పేజీలోపెట్టగా వైరల్ అయ్యింది. పింక్ డ్రెస్ ధరించిన అమ్మాయి రొట్టెకోసం పిండి కలుపుతుండగా వీడియో తీశారు. మొదట ఆమె గమనించకుండా పిండి కలిపి రొట్టెలు చేయడం మొదలెట్టింది..తర్వాత ఎవరో వీడియో తీస్తున్నారని గమనించి కెమెరావైపు అమాయకంగా చూస్తూ అందంగా నవ్వింది. ఈ నవ్వుకే నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియోకు 2 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.