హైదరాబాద్ : మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. నాగులపల్లి తండాలో బాలిక అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. గ్రామస్తులు తెలిపిన వివరాలివి.. తండాకు చెందిన శంకరయ్యను భార్య వదిలేయడంతో రెండో వివాహం చేసుకున్నాడు.
చిన్నతనం నుంచి కుమార్తె సునీత (14)ను తానే పెంచుతున్నాడు. శంకర్ ఇటీవలే పాముకాటుతో మరణించాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూడగా సునీత కనిపించలేదు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెతకగా ఊరి బయట వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.