హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతాల్లో పాదచారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తుంది. పాదచారులను ఆకర్షించేలా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి.
అయితే పంజాగుట్ట హైదరాబాద్ సెంట్రల్ మాల్ వద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇవాళ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మొత్తం వుడెన్ కలర్తో రూపొందించిన ఈ బ్రిడ్జి పంజాగుట్ట సర్కిల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. మరో 6 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను రాబోయే 4 నుంచి 6 వారాల్లో ప్రారంభించనున్నట్లు పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Stylish, state of art Foot over Bridge (FoB) at #Hyderabad central Mall, Punjagutta being inaugurated today by @GHMCOnline Mayor @GadwalvijayaTRS garu.
6 more FoBs getting ready & will be operational in next 4-6 weeks @KTRTRS @YadavTalasani pic.twitter.com/6iVTyYLoyb
— Arvind Kumar (@arvindkumar_ias) May 11, 2022