హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీకి కరోనా సోకింది. ఈ మేరకు మేయర్ ట్వీట్ చేశారు. తనకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకొని, జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ సూచించారు.
మేయర్ విజయలక్ష్మీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ నెల 29న జరగాల్సిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వినాయక చవితి ఉత్సవాల అనంతరం సర్వసభ్య సమావేశం జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
I have been tested positive with COVID 19, I’m doing well. Request everyone who came in contact with me to get tested for COVID.
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) August 24, 2022