సిటీబ్యూరో, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో రూ.158 కోట్ల వ్యయంతో 385 వీడీసీసీ రోడ్లను చేపట్టనున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. ఎన్బీటీ నగర్ కమాన్ నుంచి పూర్ని షాప్ మీదుగా జేఎన్ఐఏఎస్ సూల్ వరకు, రామాలయం నుంచి మైథిలీ నగర్ ఎంట్రెన్స్ గేట్, అకడ నుంచి బంజారా హిల్స్ రోడ్ నంబర్ 18 వరకు ఒక కోటి 29 లక్షల 63 వేల 296 రూపాయలతో చేపట్టే వీడీసీసీ రోడ్డు నిర్మాణానికి మేయర్ గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.158 కోట్ల విలువైన 385 పనులు చేపట్టినట్లు మేయర్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.101.60 కోట్ల వ్యయంతో 448 పనులను చేపట్టినట్లు మేయర్ ఈ సందర్భంగా అన్నారు. జీహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శంకుస్థాపన చేసిన పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.