హుజురాబాద్ రూరల్ : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైందని మెజార్టీకోసమే కృషిచేయాలని టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు వొడితల ప్రణవ్బాబు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కనుకులగిద్ద, జూపాకతో పాటు పలు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని అన్నారు.
ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెల్లినా టీఆర్ఎస్ పార్టీకే ఆదరణ ఉందని పేర్కొన్నారు. ప్రతిగ్రామంలో యువత 90శాతం టీఆర్ఎస్ కే మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.