Gehlot | యూపీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంత ప్రచారం చేస్తే బీజేపీకి అంత నష్టమని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ప్రభుత్వ వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి, వీరిద్దరూ కేవలం యూపీకే పరిమితమయ్యారని ఆయన మండిపడ్డారు. బెంగాల్ ఎన్నికలు వారిద్దరికీ ఓటమి రుచి చూపించాయని, యూపీ ఎన్నికల్లోనూ ఇలాగే జరుగుతుందన్నారు. ఎందుకంటే యూపీ ప్రజలకు వారి గురించి బాగా తెలుసన్నారు. దేశంలోని స్వామీజీలు పలు ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, అయినా ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఓ వైపు గాంధీని గౌరవిస్తున్నామంటున్నారని, గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం కనీసం ఖండించడం లేదని గెహ్లోత్ తీవ్రంగా మండిపడ్డారు.