చండూరు, సెప్టెంబర్ 27: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు జో రందుకొన్నాయి. వారం క్రితం టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన గట్టుప్పల్ ఎంపీటీసీ సభ్యురాలు అవ్వారు గీతాశ్రీనివాస్ మంగళవారం సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ గోపగా ని వెంకటనారాయణగౌడ్ సమక్షంలో తిరిగి గులాబీ కండువా కప్పుకొన్నారు.
చండూరు మండలం చొప్పరివారిగూడెం గ్రామానికి చెందిన 50 మంది ఎమ్మెల్యే నోముల భగత్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.