హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నంలో ఘోరం జరిగింది. కింగ్స్ రెస్టారెంట్లో బుధవారం మధ్యాహ్నం రెండు సిలిండర్లు ఒకేసారి పేలిపోయాయి. దీంతో భారీ శబ్దం వచ్చింది. జనాలు భయంతో పరుగులు తీశారు. రెస్టారెంట్ అంతటా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫర్నీచర్తో పాటు వంట సామాగ్రి చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే కింగ్స్ రెస్టారెంట్పైనే ఓ కాలేజీ కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం.