ప్రయాగ్రాజ్,జూన్ 25 :రుతుపవనాలరాకతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగా నీటి మట్టం పెరుగుతున్నది.నదికి పక్కన ఉన్న ఇసుక దిబ్బల్లో ఖననం చేసిన మృతదేహాలు ఇప్పుడు ప్రయాగ్రాజ్లోని నీటిలో తేలుతున్నాయి. గత మూడు నెలల్లో కరోనా మహమ్మారి కారణంగా చనిపోయిన వ్యక్తులను ఆయా ప్రాంతంలో ఖననం చేయడంతో కుప్పలు కుప్పలుగా శవాలు నీటి ప్రవాహంలో కొట్టుకొని వస్తున్నాయి.
ఇప్పుడు వీటిని బయటకు తీసేందుకు అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ఇది ప్రయాగ్రాజ్ అధికారులకు తలనొప్పిగా మారింది. కొంత మంది సాయంతో నదిలో తేలియాడుతున్న మృతదేహాలను బయటకు తీయిస్తున్నారు. ప్రయాగ్రాజ్లోని వివిధ ఘాట్ల వద్ద దీనికి సంబంధించి స్థానిక జర్నలిస్టులు తీసిన వీడియోలు, ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇవే సంఘటనలు పలు ఘాట్లలోదర్శనమిస్తున్నాయి. వాటిని బయటకు తీసి అధికారులు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. 24 గంటల్లో ఇప్పటి వరకు 40 మృతదేహాలను వెలికితీసినట్లు ప్రయాగ్ రాజ్ కార్పొరేషన్ జోనల్ అధికారి నీరజ్ కుమార్ సింగ్ చెప్పారు. వీటన్నింటికీ విడివిడిగా దహన సంస్కారాలు చేశామని పేర్కొన్నారు.
నదిలో కొట్టుకుపోతున్న ప్రతి మృతదేహానికి అంత్యక్రియలు చేస్తానమని మేయర్ అభిలాష గుప్తా నంది తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృత సమయంలో యుపి, బీహార్ గంగానదీ పరివాహక ప్రాంతాల్లోకి వేలాది శవాలు కొట్టుకువచ్చిన సంగతి విదితమే. అంతేకాకుండా నదీ తీరాన ఇసుకలో వేలాది శవాలు పూడ్చిన చిత్రాలు బహిర్గతమయ్యాయి. ఇవన్నీ కోవిడ్తో చనిపోయిన వారివని, ఇవన్నీ యుపి అధికారిక లెక్కల్లోకి రాలేదన్న వార్తలు వచ్చాయి. కానీ వీటిని తోసిపుచ్చిన యుపి సర్కార్, నది ఒడ్డున మృత దేహాలను పూడ్చటం ఎప్పటి నుంచో ఉందని సమర్థించుకున్నది.