వరంగల్ : నర్సంపేటలో రెండు తలలపాములను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా 11 మందిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారయ్యారు. పట్టుబడ్డ వారిలో పది మంది బిహార్కు చెందిన వారు. నర్సంపేటకు చెందిన నరియా, కొత్తగూడకు చెందిన ముత్యాల నవీన్, మిర్యాలగూడెంకు చెందిన నాగయ్యతో కలిసి బిహార్ ముఠా రెండు తలల పాముల స్మగ్లింగ్కు పాల్పడుతోంది. నర్సంపేట, పాకాలా రిజర్వు ఫారెస్ట్లో రెండు తలల పాములను పట్టుకునేందుకు గాలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి, ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన నవీన్, నాగయ్యతో పాటు బిహార్కు చెందిన రితిసింగ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.