హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ వద్ద గణనాథుల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అబిడ్స్ వరకు గణనాథులు బారులు తీరాయి. ఈ రోజు రాత్రి వరకు నిమజ్జనం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, ట్యాంక్ బండ్ రోడ్లపైకి గణనాథులను తరలించి, వేగంగా నిమజ్జనం చేస్తున్నారు. సాధారణ వాహనాలకు ఇబ్బంది లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఖైరతాబాద్ మహా గణపతిని ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నంబర్ -4 వద్ద నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మిగతా గణనాథుల నిమజ్జన ప్రక్రియ వేగవంతమైంది.