పఠాన్ చెరులో గాంధీ జయంతి (Gandhi birth anniversary) సందర్భంగా పార్కు ప్రారంభం చేయడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. పఠాన్చెరు పట్టణంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితోపాటు కలిసి గాంధీ పార్కును ప్రారంభించారు. గాంధీ అహింస విధానంలో బ్రిటిష్ వాళ్ల నుండి స్వాతంత్య్రం తీసుకువచ్చారు. గాంధీజీ అనుసరించిన అహింస పద్ధతి ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచింది. కొందరు గాంధీజీని కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పఠాన్ చెరులో 250 కోట్లతో మల్టీ స్పెషాలిటీ నిర్మాణం కాబోతుంది. హైదరాబాద్కు కృష్ణ జలాలు తెచ్చి తాగునీటి సమస్యను శాశ్వతంగా లేకుండా చేశాం. తెలంగాణ లో కరెంటు, తాగునీటి సమస్య లేకుండా చేసాము. ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం కేంద్రం నుండి అవార్డులను సాధిస్తుంది. మిషన్ భగీరథ (Mission bhagiratha)కు నీతి ఆయోగ్ నిధులు ఇవ్వమన్నా కేంద్రం ఇవ్వలేదు. తెలంగాణకు మిషన్ భగీరథ పథకానికి అవార్డు వచ్చినా సంకుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అవార్డులు వస్తున్నాయని కేంద్రం అవార్డ్స్ బంద్ చేస్తుంది కావచ్చన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు అడ్డం కాదు, నిలువు కాదు అన్న వాళ్లు…ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు..నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.