నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 2 : అహింసతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మహాత్మా గాంధీ 153వ జయంతిని జిల్లా కేంద్రంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. బాపూజీ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ అహింసామార్గంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారన్నారు. గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నా రన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, డిచ్పల్లి జడ్పీటీసీ సభ్యురాలు దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, నిజామాబాద్, ధర్పల్లి మండలాల టీఆర్ఎస్ అధ్యక్షుడు మధుకర్రావు, మహిపాల్ యాదవ్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, టీఆర్ఎస్ నాయకులు ప్రేమ్దాస్నాయక్, రాంగోపాల్రెడ్డి పాల్గొన్నారు.
గాంధేయమార్గం ఆదర్శం.. అనుసరణీయం..
ఇందూరు/ ఖలీల్వాడి, అక్టోబర్ 2 : గాంధేయమార్గం అందరికీ ఆదర్శం, అనుసరణీయమని నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నగరంలోని గాంధీచౌక్లో ఉన్న గాంధీ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా గాంధీ సినిమాను పక్షం రోజుల పాటు విద్యార్థులకు ఉచితంగా వీక్షించే ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కార్యక్రమాల్లో నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు రషీద్, సాజిద్, ముస్తాక్, అధికారులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధికారులు, జడ్పీ సిబ్బంది పాల్గొన్నారు.
రూరల్ క్యాంప్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
గాంధీచౌక్లో గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మేయర్, అదనపు కలెక్టర్