న్యూఢిల్లీ: కరోనా వైరస్తో మరో కొత్త ముప్పు దాపురించింది. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న వారిలో గాల్బ్లాడర్ గాంగ్రిన్ అనే కొత్త వ్యాధి వస్తున్నది. భారత్లోనూ ఇవాళ తొలిసారిగా గాల్బ్లాడర్ గాంగ్రిన్ కేసులు బయటపడ్డాయి. కరోనా నుంచి కోలుకున్న ఐదుగురిలో ఈ వ్యాధి బయటపడటం ఆందోళన కలిగిస్తున్నది. 37 నుంచి 75 ఏండ్ల మధ్య వయసున్న నలుగురు పురుషులు, ఒక మహిళకు ఈ వ్యాధి సోకింది. ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఐదుగురూ ఈ ఏడాది జూన్-ఆగస్టు మధ్య కరోనా నుంచి కోలుకున్నారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్, గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ అనిల్ ఆరోరా ఈ వ్యాధి వివరాలను మీడియాకు వెల్లడిస్తూ.. ”వాంతులు, జ్వరం, ఉదరం కుడి భాగంలో నొప్పి వంటి లక్షణాలతో కొందరు ఆసుపత్రిలో చేరారు. వీరికి పరీక్షలు చేయగా గాల్బ్లాడర్ గాంగ్రిన్ అని తేలింది. ప్రస్తుతం ఈ ఐదుగురు రోగులకు లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నాం. గాల్బ్లాడర్లో వాపు అనేది ఉత్తర భారతదేశంలో సాధారణమైన అంశం. ఈ వ్యాధిని కోలిసైస్టిటిస్ అని పిలుస్తారు. సాధారణంగా 10 శాతం మందికి అకాల్య్కులస్ కోలిసైస్టిటిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఫలితంగా ఎటువంటి లక్షణాలు లేకుండానే ఉదరంలో నొప్పి తలెత్తుతుంది” అని చెప్పారు.