న్యూఢిల్లీ: తన ప్రసంగాలు, వ్యాఖ్యలను వక్రీకరిస్తే సహించబోనని అలాంటి వ్యక్తులపై చట్టపర చర్యలకు కూడా వెనుకాడనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గట్టిగా హెచ్చరించారు. ‘నా పదవి గురించి నాకు చింతించలేదు’ అని గడ్కరీ అన్నట్లుగా వైరల్ అవుతున్న వీడియో క్లిప్పై గురువారం ఆయన స్పందించారు. ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇటీవల గడ్కరీ ప్రసంగానికి సంబంధించిన ఎడిట్ చేసిన క్లిప్ను ట్వీట్ చేశారు. ‘నా పదవి గురించి నాకు చింతించలేదు. నేను రాజకీయ వృత్తిలో లేను. ఏమి జరుగుతుందో నేనూ చూస్తాను..’ అని గడ్కరీ మాట్లాడినట్లు అందులో ఉంది. కాగా, నితిన్ గడ్కరీ ఇలా ఎందుకు అన్నారు? అంటూ సంజయ్ సింగ్ ఆ ట్వీట్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే ‘గడ్కరీ బీజేపీని వీడుతున్నారా?’ అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్, గతం గురించి గడ్కరీ ఇటీవల ప్రస్తావించిన సందర్భంలోనిది. 1996లో మహారాష్ట్రలోని శివసేన సీఎం మనోహర్ గజానన్ జోషి ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యుడీ) మంత్రిగా నితిన్ గడ్కరీ ఉన్నారు. నాడు జరిగిన ఒక వృత్తాంతాన్ని తాజాగా ఆయన గుర్తు చేసుకున్నారు. మనోహర్ జోషితో ఆయన అన్న వ్యాఖ్యలను ఇటీవల ఒక ప్రసంగంలో ప్రస్తావించారు.
కాగా, ఈ వీడియోను ఎడిట్ చేసి తప్పుడు అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై నితిన్ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగాలు, వ్యాఖ్యలను వక్రీకరించవద్దని హెచ్చరించారు. అలాంటి వ్యక్తులను చట్టం ముందుకు తీసుకెళ్లడానికి కూడా తాను వెనుకాడబోనని అన్నారు. మీడియా, సోషల్ మీడియా, ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులు రాజకీయ మైలేజ్ కోసం తనపై ‘కల్పిత ప్రచారాన్ని’ కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారంటూ గడ్కరీ మండిపడ్డారు. ఈ మేరకు గురువారం వరుసగా ట్వీట్లు చేశారు. అలాగే ఆయన మాట్లాడిన పూర్తి వీడియోను కూడా పోస్ట్ చేశారు.
आख़िर ऐसा क्यों बोले नितिन गडकरी जी?
BJP बहुत बड़ी गड़बड़ चल रही है। pic.twitter.com/woHE4mhNcn— Sanjay Singh AAP (@SanjayAzadSln) August 25, 2022
…I will not hesitate to take them to the law in the larger interest of our Government, Party and millions of our hardworking Karyakartas.
Therefore, I'm sharing the link of what I had actually said.👇https://t.co/jk7eR4056r
— Nitin Gadkari (@nitin_gadkari) August 25, 2022