ముంబై, ఆగస్టు 23: హలాల్ మాంసానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. హలాల్ మాంసం ఇండస్ట్రీ కారణంగా హిందువులకు తీరని నష్టం జరుగుతున్నదని, ఉగ్రవాదానికి ఇది ఆర్థిక మూలాలను సమకూరుస్తున్నదన్నారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నూపుర్ శర్మను ఆయన సమర్థించారు. ముస్లిం మత బోధకుడు జాకీర్ నాయక్ కూడా ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అయితే క్షమాపణలు చెప్పాలని అయన్ని ఎవరూ డిమాండ్ చేయట్లేదని ఈ సందర్భంగా మండిపడ్డారు.