భోపాల్ : ఇండోర్లోమహాత్మ గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) మెడికల్ కాలేజ్లో సీనియర్ల ర్యాగింగ్పై ఫ్రెషర్లు సంచలన ఆరోపణలు చేశారు. కొందరు సీనియర్లు తమను దిండ్లతో శృంగారం చేయాలని ఒత్తిడి చేశారని, విద్యార్ధినుల పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు ఆరోపించారు.
వర్సిటీ యాంటీ ర్యాగింగ్ హెల్ప్లైన్కు విద్యార్ధులు ఫిర్యాదు చేయడంతో ఈ అరాచకాలు వెలుగుచూశాయి. సీనియర్లు తమను అసహజ శృంగారం సహా అభ్యంతరకర చర్యలకు పాల్పడేలా ఒత్తిడి చేశారని, తోటి విద్యార్ధినుల పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని బాధితులు ఫిర్యాదు చేశారు.
యూజీసీ యాంటీ ర్యాగింగ్ యూనిట్ విద్యార్ధుల ఫిర్యాదును ఎంజీఎంఎంసీ డీన్ దృష్టికి తీసుకువచ్చారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని డీన్ను కోరారు. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎంజీఎం మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ సంజయ్ దీక్షిత్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 8 నుంచి 10 మంది థర్డ్ ఇయర్ విద్యార్ధులపై పోలీసులు కేసు నమోదు చేశారు.