పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ శుభారంభం చేయగా మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి-ధ్రువ్ కపిల జోడీ నిరాశపర్చింది. పారిస్లో మంగళవారం ప్రారంభమైన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ తొలి రౌండ్లో సమీర్ 21-14, 21-12తో లీ డాంగ్ కెన్ (కొరియా)ను చిత్తు చేశాడు. డెన్మార్క్ ఓపెన్లో గాయం కారణంగా క్వార్టర్స్ నుంచి వైదొలిగిన సమీర్ ఈ మ్యాచ్లో వరుస గేమ్ల్లో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి-ధ్రువ్ ద్వయం 21-19, 21-19తో చాంగ్ పెంగ్ సూన్ – గో లియ్ ఇంగ్ (మలేషియా) జోడీ చేతిలో ఓడింది.