రామన్నపేట, అక్టోబర్ 21 : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్ పంతులు (101) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారు. స్వాతంత్య్ర సమరం నుంచి ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం వరకు అనేక పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు. నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత మనోహర్ పంతులు జనంపలి ్లకేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జనంపల్లికి రెండుసార్లు సర్పంచ్గా, జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వగ్రామంలో బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటుకు పదిఎకరాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మూడున్నర ఎకరాల భూమిని దానం చేశారు.