హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కాలేజీల్లోని ఇంటర్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తద్వారా 3 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యామండలి ద్వారా రూపొందించిన స్టడీ మెటీరియల్ను బుధవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించేలా దీనిని రూపొందించామని చెప్పారు. ప్రభుత్వ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్ల విద్యార్థులందరికీ ఉచితంగా అందిస్తామని తెలిపారు. మెటీరియల్ను www.tsbie.cgg.gov.inలోనూ ఉచితంగా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.