కొండాపూర్, డిసెంబర్ 12 : కరోనా విపత్కర సమయంలో ఆర్టిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైటెక్ సిటీలోని మెడికవర్ దవాఖాన యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు. ఆదివారం మెడికవర్ దవాఖానలో ఆర్టిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని విష్ణు ముఖ్య అతిథిగా హాజరై దవాఖాన చైర్మన్ అనిల్ కృష్ణతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మా ప్రతినిధులు, దవాఖాన సిబ్బంది, ఆర్టిస్టులు తదితరులు పాల్గొన్నారు.